గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (11:38 IST)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌దే గెలుపు: ఫస్ట్ పోస్ట్ స్టోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఫస్ట్ పోస్ట్ వెబ్ సైట్ తెలిపింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఊహిస్తూ ‘‘పాంచ్ సాల్ కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ పార్టీ మే బీ హెడెడ్ ఫర్ ఏ ల్యాండ్ స్లైడ్ విన్’’ పేరిట ఆ వెబ్ సైట్ ఈ కథనాన్ని రాసింది.
 
ఈ కథనంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించి.. తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్ సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఈ వెబ్ సైట్ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేతృత్వంలో నడుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులతో పాటు పారిశ్రామిక వర్గాల్లో కీలక చర్చగా మారింది.