ఒప్పందాన్ని ఉల్లంగించిన పాక్... భారత సైన్యంపై మళ్లీ కాల్పులు
భారత్తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ ఉల్లంఘించింది. శుక్రవారం రాత్రి జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకోట్ వద్ద భారత శిబిరాలపై పాక్ సైన్యం ఆకస్మిక కాల్పులు జరిపింది. దీంతో చేసేది లేక భారత సైన్యం కూడా ఎదురు కాల్పులు జరిపింది.
ఈ విషయమై భారత రక్షణ శాఖ అధికార ప్రతినిధి మెహతా మాట్లాడుతూ.. పాకిస్తాన్ మళ్లీ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. అయితే పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు.
శుక్రవారం రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని, దాదాపు గంటపైగా ఇరువైపులా కాల్పులు జరిపుకున్నాయని మెహతా వివరించారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని ఆయన వెల్లడించారు.