శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:34 IST)

స్మారక నిలయంగా పోయెస్ గార్డెన్ ఇల్లు . పన్నీర్ ఆదేశాలు : అడ్డుకుంటానన్న శశికళ

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు పన్నీర్ సెల్వం - శశికళకు ఆధిపత్య పేరుకు కేంద్రంగా మారింది. జయలలిత ఇంటిని అమ్మా మెమోరియల్‌గా మార్చుతూ ఆపద్ధర్మ ముఖ

ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇపుడు పన్నీర్ సెల్వం - శశికళకు ఆధిపత్య పేరుకు కేంద్రంగా మారింది. జయలలిత ఇంటిని అమ్మా మెమోరియల్‌గా మార్చుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం జీవో జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జయలలిత మరణానంతరం శశికళతో పాటు... మన్నార్గుడి మాఫియా నివాసముంటుంది. అయితే వేద నిలయాన్ని జయలలిత స్మారకంగా మార్చుతానని పన్నీరు సెల్వం కొద్దిసేపటి క్రితం చెప్పారు. శశికళ, ఆమె కుటుంబం అక్రమంగా అక్కడ ఉంటున్నారని పన్నీరు సెల్వం ఆరోపించారు. దీనికి సంబంధించిన జీవో తయారు చేసి తీసుకునిరావాలని గురువారం తనను కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను ఆదేశించినట్టు సమాచారం. 
 
మరోవైపు.. పన్నీర్ నిర్ణయాన్ని శశికళ తీవ్రంగా ఖండించారు. శశికళ ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదని చెబుతున్నారు. జయలలిత నివాసమున్న ఆ ఇల్లు ఇళవరసి కొడుకు వివేక్ పేరు మీద ఉందని, ఇళవరసి స్వయానా శశికళ వదిన అని ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. వేద నిలయం ప్రభుత్వ ఆస్తి కాదని, ప్రైవేట్ ఆస్తి అని శశికళ వర్గీయులు వాదిస్తున్నారు. ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తే కోర్టును ఆశ్రయిస్తామని శశికళ వర్గం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో జయలలిత వేద నిలయం కూడా చర్చనీయాంశం కావడం గమనార్హం.