మురళీ దేవ్రా మృతికి సంతాపం.. రేపటికి పార్లమెంట్ వాయిదా!!
అనారోగ్యం కారణంగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవ్ర మృతికి పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసి, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.
సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.
అనంతరం అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మురళీదేవరాకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం పార్లమెంట్ మంగళవారానికి వాయిదా పడింది.