పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ను "చోటి దీపావళి''గా అభివర్ణించిన మోడీ.. టెర్రరిస్టులను హతమార్చిన వేళ?
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్పై భారత్-పాకిస్థాన్ల మధ్య చిచ్చురేపిన సంగతి తెలిసిందే. యూరీ ఘటనకు అనంతరం ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత సైన్యం.. సర్జికల
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్పై భారత్-పాకిస్థాన్ల మధ్య చిచ్చురేపిన సంగతి తెలిసిందే. యూరీ ఘటనకు అనంతరం ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భారత సైన్యం.. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా గట్టిగా బుద్ధి చెప్పింది. అయినా తన తీరు మార్చుకోని పాకిస్థాన్.. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని.. బూటకమని ఎన్నో కథలు చెప్పింది. అయితే ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పారు.
పీఓకేలో ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ను ‘చిన్న దీపావళి’గా మోడీ అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. ''మనం సెప్టెంబర్ 29వ తేదీన చిన్న దీపావళి సంబరాలు చేసుకున్నాం'' అంటూ వ్యాఖ్యానించారు.
మన సైనికులు టెర్రరిస్టులకు హతమార్చిన వేళ, వారణాసిలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసిందని గుర్తు చేశారు. ఇప్పటికే సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా చిన్న దీపావళి జరిపించిన సైనికులకు దీపావళి రోజున శుభాకాంక్షలు పంపుదామన్నారు.