శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 మే 2016 (12:15 IST)

అవును... పతంజలి ఉత్పత్తులకు నేను శాశ్వత ప్రచారకర్తను : లాలూ ప్రసాద్

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాందేవ్‌ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, అది కాస్తా పతంజలి కొత్త ఉత్పత్తులైన ప్రత్యేక క్రీం, ఎనర్జీ బార్‌ల ప్రచార కార్యక్రమంగా మారిపోయింది. దీనికి కారణం ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనడమే. 
 
ఈ కార్యక్రమంలో లాలూ మాట్లాడుతూ రాందేవ్‌ బ్రాండ్‌ ఉత్పత్తుల్లో ఎముకల పొడి ఉంటుందనే వార్తల్లో నిజం లేదని, అది కుట్ర అని లాలూ తెలిపారు. 'రాందేవ్‌ తయారు చేసిన సబ్బుల్లో మా ఆవు పాలుంటాయి. సాధారణ సబ్బుల్లో సోడా అధికంగా ఉంటుంది. కానీ పతంజలి ఉత్పత్తుల్లో ఉండదు అని చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత పతంజలి ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉంటారా? అని కొందరు లాలూని ప్రశ్నించగా.. 'అవును! పతంజలి ఉత్పత్తులకు నేను శాశ్వత ప్రచారకర్తగానే' అని బదులిచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న రాందేవ్‌.. ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గోల్డ్‌ క్రీంను లాలూ నుదుటిపై రాసి.. 'ఇది మీకు మరింత అందాన్నిస్తుంది. మేము కేవలం ఆయుర్వేద గుణాలు కలిగిన వస్తువులనే తయారుచేస్తాం' అని చెప్పుకొచ్చారు