శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (12:44 IST)

ఎంపీలు - ఎమ్మెల్యేలకు మోడీ షాక్.. బ్యాంకు ఖాతా వివరాల వెల్లడికి ఆదేశం

దేశంలోని నల్లకుబేరులకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇపుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దు

దేశంలోని నల్లకుబేరులకు షాకిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇపుడు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు తేరుకోలేని షాకిచ్చారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నోట్ల రద్దు కారణంగా దేశ వ్యాప్తంగా కరెన్సీ నోట్లతో పాటు.. చిల్లర కష్టాలు ఉత్పన్నమయ్యాయి.  
 
పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ‍్మెల్యేలు అందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు సమర్పించాలని సూచించారు. అలాగే బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలని ఆదేశించారు.
 
ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు డిసెంబర్‌ 31 వరకు గడువు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ‍్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోడీ ఆదేశించినట్టు తెలుస్తోంది.