శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 28 మే 2015 (18:01 IST)

ఏడాది గడిచినా ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ : మోడీ ఫైర్

గత యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదని అందుకే తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. తన సర్కారు యేడాది పాలన పూర్తి చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, ఏడాది గడచినా కాంగ్రెస్ వాళ్లు ఆ పరాభవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 
 
ప్రజలు వారిని శిక్షించారని అన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారని భావించామని, కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విపక్షాలు విమర్శిస్తుండటంపై ఆయన స్పందనను కోరగా... కార్పొరేట్ వర్గాలేమో తమకు సర్కారు నుంచి ఏమీ సాయం అందడం లేదని వాపోతున్నాయని సమాధానమిచ్చారు. దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయని స్పష్టం చేశారు.