బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 సెప్టెంబరు 2014 (22:35 IST)

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు

గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో చైనా అధ్యక్షుడు ఆయన సతీమణి ప్రధాని పాల్గొన్నారు. సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చిన ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొన్నారు.