శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (16:15 IST)

ప్రతి చిన్న విషయానికి మోడీ స్పందించాలా : లలిత్ గేట్‌పై వీకే సింగ్

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉడటంపట్ల విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తుంటే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందిస్తూ... ప్రతి చిన్న విషయానికి ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 
 
'మాట్లాడాలి, మాట్లాడాలి... అంటూ ఎందుకాయనను బలవంతం చేస్తారు? ప్రతి దానికి స్పందించడం సరికాదు కూడా. ఏదో న్యూస్ చానల్లో మరేదో ప్రసారమైతే దాని మీద ప్రధాని మాట్లాడాలా?... ప్రధాని మాట్లాడాలంటే తగిన సమయం రావాలి' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై చానళ్లు కొన్నిరోజులుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని, ఆ విధమైన కథనాలు ప్రసారం చేయాలంటూ ఆయా చానళ్లకు కాంట్రాక్టు ఎవరిచ్చారని వీకే సింగ్ ఎదురుదాడికి దిగారు.