శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (11:18 IST)

నరేంద్ర మోడీ బర్త్ డే : తల్లికి పాదాభివందనం ... రూ.5001 కానుక!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం సాదాసీదాగా జరుపుకున్నారు. అయితే, తన తల్లి హీరాబా ఇంటికి వెళ్లిన ఆయన.. తల్లికి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడికి తల్లి రూ.5001ను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని హోదాలో తొలి జన్మదినాన్ని జరుపుకుంటున్న కొడుకును ఆశీర్వదించిన హీరాబా, రూ.5001లను జన్మదిన కానుకగా అందించారు. ఈ మొత్తాన్ని మోడీ, జమ్మూకాశ్మీర్ వరద బాధితుల సహాయనిధికి అందజేశారు. 
 
ఇదిలావుంటే, జన్మదినం సందర్భంగా తల్లి దీవెనల కోసం అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే మోడీ, ఓ సాధారణ కారులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాశ్మీర్ వరదల నేపథ్యంలో ఎవరూ తన జన్మదిన వేడుకలను జరపవద్దన్న మోడీ, తాను కూడా తల్లి దీవెనలు తీసుకుని సరిపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జపాన్ ప్రధాని షింజో అబేలు మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.