గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (15:51 IST)

మీడియాకు మోడీ దీపావళి విషెస్ అండ్ థ్యాంక్స్!: క్లీన్ ఇండియా గురించి..?

మీడియా ప్రతినిధులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తమ పనితీరు వల్లే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో విజయం సాధించామని మోడీ వ్యాఖ్యానించారు. మీడియాతో తాము సత్సంబంధాలను నెరపుతామని ప్రకటించారు. 
 
ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దివాలీ మిలాన్‌ను పురస్కరించుకుని తొలిసారి మీడియాతో భేటీ అయిన మోడీ పలు అంశాలను ప్రస్తావించారు. 
 
దేశ రూపురేఖలు మార్చేందుకు తాము కంకణబద్ధులమై ఉన్నామని, అందుకు సహకారం అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీడియా ప్రతినిధులను కోరారు. అలాగే క్లీన్ ఇండియాలో మీడియా కూడా పాలుపంచుకోవాలని, తద్వారా దేశానికి మీడియా సేవ చేసినట్లు అవుతుందని మోడీ వ్యాఖ్యానించారు.