గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జులై 2016 (13:00 IST)

పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు... సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు!

పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించేందుకు సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

పిల్లల అశ్లీల చిత్రాలు, వీడియోలతో వెబ్‌సైట్లు నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అశ్లీల వెబ్‌సైట్లు వీక్షించేందుకు సభ్యత్వ రుసుంగా రూ.2.4 కోట్లు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నయ్ నగరానికి చెందిన సిద్ధార్థ వేలు, అతని భార్య ప్రిస్కిల్లా మార్గరెట్ ధన్‌రాజ్‌లు కలిసి ఈ వెబ్‌సైట్‌లు నడుపుతున్నారని, ఈ వెబ్‌సైట్‌లకు వారి ఈమెయిల్ ఐడీలను సైతం లింక్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. సభ్యత్వ రుసుం కింద రెండు అశ్లీల వెబ్‌సైట్‌లకు రూ.2.4 కోట్లు బెంగళూరులోని సిద్ధార్థ వేలు బ్యాంకు ఖాతాలోకి వచ్చాయని వెల్లడైంది. 
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టు కింద అశ్లీల వెబ్‌‌సైట్లు నిర్వహించిన దంపతులపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నయ్ కేంద్రంగా ఈ వెబ్ సైట్‌ల హోస్టింగ్ సాగుతుందని సైబర్ క్రైం విభాగం పరిశోధనలో వెల్లడైంది.