అంబులెన్స్కే ప్రమాదం: నిండుగర్భిణి మృతి.. గర్భస్థ శిశువు కూడా..!
ఎవరికైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ వస్తుంది.. మరి అంబులెన్స్కే ప్రమాదం జరిగితే ఎలా ఉంటుంది.. అలాంటి ఘటన ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ సమీపంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణిని తీసుకుని ఆసుపత్రిలో చేర్చేందుకు వేగంగా వెళ్తున్న అంబులెన్స్ను ఓ కారు అంతకంటే వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ దుర్ఘటనలో గర్భస్థ శిశువుతోపాటు ఆమె కూడా మృతి చెందింది. అంబులెన్స్లో ప్రయాణిస్తున్న నర్సుతోపాటు ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.