శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:44 IST)

సీఎం విజ్ఞప్తి మేరకే గుజరాత్ విద్యార్థులకు శిక్షణ: పీటీ ఉష వెల్లడి

అలనాటి పరుగుల రాణి పీటీ ఉష గుజరాత్లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకే గుజరాత్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సమ్మత్తించినట్టు ఆమె తెలిపారు. అక్కడ కొంతమంది బాలలను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష అంగీకరించినట్లు పేర్కొన్నారు.
 
అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. సియోల్ ఒలింపిక్స్లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి.