శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 మే 2016 (17:51 IST)

సుప్రీం తీర్పును కాదని రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారు: హర్యానా సర్కారుకు హైకోర్టు మొట్టికాయ

జాట్‌ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించిన విషయంపై హర్యానా ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మొట్టికాయ వేసింది. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. అయితే, దీన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్నితోసిపుచ్చి హర్యానా సర్కారు.. కొత్తగా సృష్టించిన బీసీ(సీ) కేటగిరీలో జాట్లకు, మరో నాలుగు సామాజిక వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్ల అమలును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నిలిపేసింది. 
 
ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాట్‌లు గత కొంతకాలంగా ఆందోళనకు దిగిన విషయంతెల్సిందే. దీంతో దిగివచ్చిన హర్యానా సర్కారు రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు గత మార్చి 29వ తేదీన రిజర్వేషన్లు కల్పించే నిమిత్తం రూపొందించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదించిన హర్యానా వెనుకబడిన తరగతుల (ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు) చట్టం, 2016కు వ్యతిరేకంగా భివానీకి చెందిన మురారీలాల్ గుప్తా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు గురువారం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. భివానీకి చెందిన మురారీలాల్ గుప్తా సవాలు చేశారు.