ఢిల్లీలో జర్మన్ కోడలిపై మామ అత్యాచారం.. భర్తే చేయించాడా?
దేశరాజధాని ఢిల్లీలో మరో మహిళ ఓ కామాంధుడి చేతుల్లో నలిగిపోయింది. ఈమెపై స్వయంగా ఆమె మామే అత్యాచారం చేశాడు. హోటల్ గదిలో ఉన్న ఆమెపై మామ వచ్చి రేప్ చేశాడు. ఈ బాధితురాలు జర్మన్ దేశ మహిళ. భారతదేశ యువకుడికి భ
దేశరాజధాని ఢిల్లీలో మరో మహిళ ఓ కామాంధుడి చేతుల్లో నలిగిపోయింది. ఈమెపై స్వయంగా ఆమె మామే అత్యాచారం చేశాడు. హోటల్ గదిలో ఉన్న ఆమెపై మామ వచ్చి రేప్ చేశాడు. ఈ బాధితురాలు జర్మన్ దేశ మహిళ. భారతదేశ యువకుడికి భార్య. ఈమె ఇచ్చిన ఫిర్యాదు ఢిల్లీలో సంచలనం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జర్మన్ దేశానికి ఓ యువతి పంజాబ్కు చెందిన యువకుడిని పెళ్లాడింది. ఆ తర్వాత భర్తతో కలిసి ఇక్కడికి వచ్చింది. అయితే, తన భర్త న్యూఢిల్లీ నగరంలోని పహర్గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ఆమెను వదిలి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆమె మామ వచ్చి అత్యాచారం చేశాడు. ఇదే విషయాన్ని ఆమె ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని, దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పహర్ గంజ్ పోలీసులు చెప్పారు.