గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (11:06 IST)

రాహుల్ సభకు వస్తే మంచాలు ఇస్తామన్నారు.. వచ్చాం.. తీసుకెళ్లాం : మీర్జాపూర్ ప్రజలు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఖట్‌పే సభకు వస్తే మంచాలు ఇస్తామని ముందుగానే ప్రచారం చేశారనీ, అందుకే భారీ సంఖ్యలో తరలివచ్చి ఆ మంచాలు తీసుకెళ్లినట్టు మీర్జాపూర్ ప్రజలు చెపుతున్నారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఖట్‌పే సభకు వస్తే మంచాలు ఇస్తామని ముందుగానే ప్రచారం చేశారనీ, అందుకే భారీ సంఖ్యలో తరలివచ్చి ఆ మంచాలు తీసుకెళ్లినట్టు మీర్జాపూర్ ప్రజలు చెపుతున్నారు. 
 
యూపీలో పర్యటిస్తున్న రాహుల్ 'ఖట్ సభ' పేరిట వివిధ ప్రాంతాల్లో మంచాలు వేసి ప్రజలను కూర్చోబెట్టి బహిరంగ సభలు నిర్వహిస్తున్న వేళ, సభ ముగియగానే, మంచాలను తీసుకుని ప్రజలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ ప్రసంగానికన్నా మంచాలు తీసుకు వెళ్లే ప్రజలకే మంచి పబ్లిసిటీ వస్తుండగా, దీన్నెలా ఆపాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 
 
"రాహుల్ సభకు వస్తే, మంచాన్ని ఇస్తామని ఓ కాంగ్రెస్ నేత మాకు చెప్పారు. ఆ పార్టీ ఇప్పటివరకూ మాకేమీ ఇవ్వలేదు. ఇప్పటికి కనీసం ఈ మంచమైనా దక్కింది" అని మీర్జాపూర్ సభకు వచ్చి ఓ మంచం పట్టుకెళ్లిన కైలాష్ నాథ్ వ్యాఖ్యానించాడు.