గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2016 (11:13 IST)

భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ టైంబాబు... డిసెంబర్‌లో పేలుతుంది : సుబ్రమణ్య స్వామి

భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఓ టైం బాంబు పెట్టారనీ, అది వచ్చే డిసెంబరులో పేలుతుందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఓ ట్వీట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్‌లో భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ 2013లోనే ఓ టైం బాంబును పెట్టారన్నారు. ఆ బాంబు ఈ ఏడాది డిసెంబర్‌లో బద్దలు కానుందని కూడా ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. దేశీయ బ్యాంకులు విదేశాల నుంచి తీసుకున్న 24 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి రావడమే ఆ బాంబు అంటూ స్వామి అన్నారు. 
 
కాగా, రఘురాం రాజన్‌ను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా స్వామి మాటల దాడి చేస్తున్న విషయం తెల్సిందే. రాజన్ మరోమారు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించవద్దంటూ ఇప్పటికే ప్రధానికి సుబ్రమణ్య స్వామి ఇప్పటికే రెండు లేఖలు రాయగా, తాజాగా మరోమారు విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.