'వ్యాపమ్' స్కామ్పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్నాథ్
'వ్యాపమ్' స్కామ్పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ స్కామ్లో విచారణ జరుగుతున్న సమయంలోనే గత మూడు రోజుల్లో ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. దీంతో ఈ స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై ఆయన సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ 'వ్యాపమ్' కుభకోణంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు 'వ్యాపమ్' కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తుపై సంతృప్తిగా ఉన్నాయన్నారు. దర్యాప్తు సరైన దారిలోనే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.