మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 23 మే 2015 (10:22 IST)

త్వరలోనే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు : సాధ్వి ప్రాచీ

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే రామమందిర నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మహిళా నేత సాధ్వి ప్రాచీ వెల్లడించారు. జలంధర్‌లో జరిగిన బీజేపీ దళిత్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని, ఈ ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందని అన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక్ మండల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. 
 
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆమెను మరోమారు మీడియా ప్రశ్నించగా, 'మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞకు బెయిల్ నిరాకరించారు. రేప్ బాధితురాలు అరుణకు 42 ఏళ్లుగా న్యాయం జరగలేదు, ఆమె చనిపోయింది. మరి, సల్మాన్ అంత సులువుగా ఎలా బెయిల్ దక్కించుకున్నారు?' మీరే ఆలోచన చేయండి అంటూ సూచించారు.