బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (14:07 IST)

ప్రతీకారం కోసం యువతిపై సామూహిక అత్యాచారం!

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు గ్యాంగ్ రేప్‌లు జరుగుతున్నాయి. ప్రతీకారం నెపంతో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. తమ తరపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడి కుటుంబంపై ప్రతీకారం పెంచుకున్న ఐదుగురు దుండగులు.. ఆ కుటుంబానికి చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
 
అత్యాచార బాధితురాలి సోదరుడు ఆగస్టు 25న నిందితులకు బంధువైన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న బాధితురాలి సోదరుడు యువతి ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయం తెలుసుకుని ఆదివారం రాత్రి ఆమెను కిడ్నాప్ చేశాడు.  
 
ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. కాగా, తీవ్ర భయాందోళనకు గురైన బాధిత యువతి సమీపంలోని కుమ్హేడ్ బ్రిడ్జ్‌పై నుంచి దూకి చనిపోవాలని నిర్ణయించుకుంది. 
 
అయితే స్థానికులు ఆమెను అడ్డుకుని.. ఇంటికి చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.