గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (18:19 IST)

గరగాట్టం వేలూరు మోహనాంబళ్ ఎర్ర చందనం దొంగ... తెలుసుగా రూ. 5 కోట్ల సంగతీ....

తమిళనాడు వేలూరులో గరగాట్టం చేస్తూ ఉండే మహిళ మోహనాంబళ్ ఆస్తులు రూ. 5 కోట్లు అని తెలిసి తమిళనాడు పోలీసులు సంభ్రమాశ్చర్యాలకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. ఐతే తాజా సంగతి ఏంటంటే... ఈ గరగాట్టం సుందరి ఎర్ర చందనం ఎర్ర దొంగలకు ఆశ్రయమిస్తూ ఎర్ర చందనాన్ని అడ్డదారుల్లో పంపేందుకు సహకరించినట్లు తేలింది. ముఖ్యంగా ఆమెకు రూ. 5 కోట్లు ఆస్తులు ఎలా సంక్రమించాయన్న దానిపై పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు వ్యవహారం బయటపడింది. 
 
విచారణలో ఆమె ఎర్రచందనం చెట్లను నరికే కూలీలకు, రవాణా సిబ్బందికి, స్మగ్లర్లకు వసతులు కల్పించి తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసినట్లు తేలింది. అందుకు ప్రతిగా ఆమెకు ఆ మేరకు ఆస్తులు సంక్రమించినట్లు సమాచారం. కాగా అరెస్టయిన మోహనాంబళ్ జామీనుపై బయటకు వచ్చి ప్రస్తుతం వేలూరులోనే ఉంటోంది. ఈ నేపధ్యంలో ఆమెను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీఎంకె పార్టీకి చెందిన బాబు అనే అతడిపై గూండా చట్టం కింద అరెస్టు చేయడమే కాకుండా ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులోనూ విచారించేందుకు రెడీ అవుతున్నారు. వీరి వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశముందని భావిస్తున్నారు.