అంబానీ జయంతి రోజున బంపర్ ఆఫర్: 2017 చివరి వరకు ఫ్రీ డేటా ఆఫర్ పొడిగిస్తారా?
దేశవ్యాప్తంగా ఫ్రీ డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో నుంచి మరో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ డేటా ఆఫర్ గడువు ఇంకో నెల రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో.. ఈ ఆఫర్ను ఏకంగా ఏడాది పాటు పొడిగించే యోచనలో
దేశవ్యాప్తంగా ఫ్రీ డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియో నుంచి మరో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫ్రీ డేటా ఆఫర్ గడువు ఇంకో నెల రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో.. ఈ ఆఫర్ను ఏకంగా ఏడాది పాటు పొడిగించే యోచనలో జియో ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 28న ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఈ ఆఫర్ పొడిగింపు ప్రకటన ఉంటుందని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ప్రస్తుతం ఉచిత సర్వీస్తో పాటు వెల్కమ్ ఆఫర్ కూడా 2017 సంవత్సరం చివరి వరకు ఉంటుందని టాక్ వస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. డిసెంబర్ 28వ తేదీ వరకు ఆగాల్సిందే. ముఖేష్ అంబానీ, తమ్ముడు అనిల్ అంబానీ కూడా ఇటీవల ఓ బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం రూ.149 రీచార్జ్తో దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతో పాటు ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కాం ప్రకటించింది. ‘జియో’ ఆఫర్ కేవలం 4జీ వినియోగదారులకు మాత్రమే.
అయితే ఆర్కాం ఆఫర్ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ వాడుకోవచ్చు. తాజా ఆఫర్ దేశంలో మొబైల్ రీచార్జ్లో విప్లవం వంటిదని ఆర్కామ్ సీఈవో గురుదీప్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. మరి అన్నయ్యకు ధీటుగా తండ్రి జయంతి రోజు తమ్ముడు ఏం ప్లాన్ వేస్తాడో.. వేచి చూడాల్సిందే.