శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (15:43 IST)

ఐదుగురు పిల్లలు కలిగిన హిందూ కుటుంబానికి రూ. 2 లక్షలు అవార్డు: శివసేన వెల్లడి

దేశంలో నానాటికి తగ్గిపోతున్న హిందువుల జనాభాను పెంచే దిశగా శివసేన సంస్థ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఐదుగురు పిల్లలను కలిగిన ప్రతి హిందూ కుటుంబానికి రెండు లక్షల రూపాయలను అవార్డుగా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ విషయం గురించి శివసేన రాష్ట్ర అధ్యక్షురాలు వీను లావణ్య శుక్రవారం రోజు విలేకర్లతో మాట్లాడుతూ.. ఇటీవల దేశ జనాభాలో లెక్కల్లో హిందువుల సంఖ్య ఘననీయంగా తగ్గిందని తెలియడంతో ఈ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలిపింది.
 
ఈ పథకలంలో భాగంగా 2010 నుంచి 2015 సంవత్సరాల కాలంలో ఐదుగురు పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు, పిల్లల బర్త్ సర్టిఫికేట్‌లను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలలో సమర్పించి అవార్డును పొందవచ్చునని తెలిపారు.