శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (17:41 IST)

మే నెలలో ఫ్రీడం-251 స్మార్ట్ ఫోన్లు డెలివరీ చేయనున్న రింగింగ్ బెల్స్!

వివాదాల సుడిగుండంలో చిక్కున్న రింగింగ్ బెల్స్... ప్రకటించినట్టుగా స్మార్ట్ ఫోన్లను డెలివరీ చేయనుంది. ఇందుకోసం 30 వేల ఫోన్లను సిద్ధం చేసింది. అయితే, తొలి విడతగా చెల్లించిన కస్టమర్లకు (ఆన్‌లైన్ పేమెంట్) మాత్రమే ఈ ఫోన్‌ను డెలివరీ చేసే అవకాశం ఉంది. ఆపై బుక్ చేసుకున్న వారికి ఇప్పటికి ఎవరకు ఎలాంటి సమాచారం చేరవేయలేదు. దీంతో ముందు బుక్ చేసుకున్న వారు మాత్రం మే నెలలో ఫ్రీడం 251 స్మార్ట్ ఫోనును అందుకునే అవకాశం ఉంది. ఈ వార్తలే నిజమైతే వీరంతా లక్కీ కస్టమర్లుగా చెప్పొచ్చు. 
 
అతి తక్కువ ధరకే అందజేయనున్న నాలుగో తరం (4జీ) మొబైల్ హ్యాండ్‌సెట్‌ ధర వాస్తవానికి రూ.2999. కానీ, మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఫోన్‌ను ఫ్రీడం 251 పేరుతో అందజేయనుంది. అదేసమయంలో ఆ కంపెనీ మెడపై కత్తి వేలాడుతోంది. ఆ కంపెనీ ప్రకటించినట్టుగా నిర్ణీత గడువులోగా 30 వేల ఫోన్ సెట్లను డెలివరీ చేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెల్సిందే.