గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2014 (19:08 IST)

పిల్లల్ని గదిలో బంధించి... భర్తను పొడిచి... భార్యపై గ్యాంగ్ రేప్

రాజస్థాన్ లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కోసం వచ్చిన దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. వంటగది కిటికీకి ఉండే గ్రిల్ ను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న వృద్ధుడిని తాడుతో కట్టేశారు. ఆ తర్వాత పిల్లలను కత్తితో బెదిరించి గదిలో పెట్టి తాళం వేసి వారి తండ్రిని కత్తితో 9 చోట్ల పొడిచారు. 
 
ఆ కత్తిపోట్లకు అతడు స్పృహ కోల్పోయాడు. అతడిక లేవడని నిర్థారించుకున్న దొంగలు అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీ చేశారు. ఇంట్లో 10 వేలు నగదు, 150 గ్రాముల బంగారం దోచుకుని పారిపోయారు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు బాధితుల ఆర్తనాదాలు విని వచ్చి చూసి కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.