శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (13:15 IST)

మైత్రేయి ఫిర్యాదు: ముందస్తు బెయిల్ కోసం కార్తీక్ గౌడ..?

నటి మైత్రేయి తనపై ఫిర్యాదు చేసిన నేపథ్ంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్తిక్‌పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది.
 
కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని పోలీసులు ఆరు గంటల పాటు విచారించారు. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయి బెంగళూరులో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 
 
తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు.
 
అయితే సదానంద గౌడ మాత్రం కార్తీక్ అలాంటి పనిచేయలేదంటున్నారు. ఒకవేళ చేసినట్లు రుజువైతే శిక్షించవచ్చునన్నారు. తన పైన నమోదైన ఆరోపణలను కార్తీక్ కూడా ఖండించారు.