శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (18:49 IST)

రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్

బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు నోటికి పని చెప్పారు. తాజాగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు.. నేపాల్‌కు లింకు పెట్టారు. ఆవు మాంసం తినే అలవాటున్న రాహుల్ గాంధీ తనను తాను శుద్ధి చేసుకునేందుకు కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లడం వల్లే నేపాల్‌లో భూకంపం వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా మండిపడింది. ఆడవాళ్లు ఎక్కువ మంది పిల్లలను కనాలని మతిలేకుండా మాట్లాడిన సాక్షి మహారాజ్ ఒక ప్రజా ప్రతినిధిగా అనర్హుడంటూ వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం వచ్చిందని అర్థరహితంగా మాట్లాడుతున్న అతనిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.