శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (16:20 IST)

బీజేపీ నాపై కక్ష కట్టింది.. సుప్రీం కోర్టే సీబీఐ..?: మమత

భారతీయ జనతా పార్టీ తనపై, తన పార్టీపై కక్ష కట్టిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను స్వయంగా సుప్రీంకోర్టే తప్పుబట్టిన విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నెహ్రూ జయంతి వేడుకలకు హాజరయినందుకే తమ ఎంపీలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారం నిమిత్తం చేసిన ఖర్చుపై మీడియా సైతం సరైన రీతిలో స్పందించలేదని మమత విమర్శించారు.