బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (10:48 IST)

శారదా చిప్ ఫండ్ స్కామ్ : బెంగాల్ మంత్రికి సీబీఐ నోటీసు!

వెస్ట్ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో విచారణ జరుపుతున్న సీబీఐ తాజాగా పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శ్రిన్ జాయ్ బోస్‌లకు సమన్లు జారీ చేసింది. వీరిని ఒక వారంలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. శారదా స్కాంలో ఒక మంత్రికి సమన్లు జారీ కావడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఒడిశాలో, అధిక రాబడి ఉంటుందని నమ్మి శారదా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టి లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే.
 
కాగా, ఇదే కేసులో యేడాది క్రితం అరెస్టు అయి కోల్‌‍కతా జైలులో ఉంటున్న టీఎంసీ రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్‌ ఇటీవలే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం తెల్సిందే. మరోవైపు.. ఈ స్కామ్‌లో తన పాత్ర ఉన్నట్టు ఏ ఒక్క ఆధారం బయటపెట్టినా తాను రాజీనామా చేస్తానని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తాజాగా టీఎంసీకి చెందిన నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఆ పార్టీ నేతలు హడలిపోతున్నారు.