శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (19:45 IST)

శశికళకు కంట్లో నలుసుగా మారిన పన్నీర్.. మిస్డ్ కాల్ సర్వేలో ''అన్న''దే పైచేయి..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో నలుసుగా మారారు. పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తూ.. శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకు తోడు పన్నీరుకు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో నలుసుగా మారారు. పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తూ.. శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకు తోడు పన్నీరుకు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. ఆన్ లైన్ సర్వే, మొబైల్ మిస్డ్ కాల్ ద్వారా ఓటేసే పద్ధతికి మంచి క్రేజ్ లభిస్తోంది.

సోషల్ మీడియాలో పన్నీరుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. మిస్డ్ కాల్ ఇచ్చి పన్నీరుకు మద్దతిస్తున్నామని అనేకమంది ప్రజలు ముందుకొస్తున్నారు. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చే కాల్స్ భారీ ఎత్తున వస్తున్నాయని.. పన్నీర్ క్యాంప్ తెలిపింది. ఇంకా సోషల్ మీడియా ద్వారా మద్దతు పలికే వారికి పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు.
 
మరోవైపు ఎమ్మెల్యేల మద్దతు కూడా పన్నీరుకు పెరుగుతూనే ఉంది. ఊహించనిరీతిలో ఆయనకు మద్దతు వెల్లువెత్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్‌, ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్‌, పీఆర్‌ సుందరం పన్నీర్‌ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్‌ శ్రీనివాస్‌ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
 
తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్‌ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్‌ శ్రీనివాసన్‌కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్‌ సెల్వం గూటికి చేరుతుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్‌ కూడా చిన్నమ్మకు ఝలక్‌ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్‌ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
అన్నాడీఎంకేను విచ్ఛిన్నం కాకుండా కాపాడే శక్తి పన్నీర్‌ సెల్వానికి ఉందని ప్రకటించారు. పొన్నియన్‌ రాకతో సెల్వం వర్గం మరింత పుంజుకుంది. పన్నీరుకే సీఎం పదవి దక్కుతుందని టాక్ వస్తోంది.