శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (10:19 IST)

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ... జయలలిత స్థానాన్ని ఆక్రమించిన చిన్నమ్మ

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరును ప్రతి పాదిస్తూ ఓ తీర్మానం చేశారు. దీనికి సర్వసభ్య సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో శశికళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఇకపై ఆమె తీసుకునే ఏ నిర్ణయానికైనా పార్టీ నేతలు తప్పనిసరిగా కట్టుబడాల్సి ఉంటుంది. అలాగే, పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆమె ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. 
 
ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యేలు పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి శశికళను పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరనున్నారు. అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టడంతో... ఆ పార్టీలో కొత్త శకం ప్రారంభమయినట్టైంది.