శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (11:47 IST)

శశికళ పుష్పకు ఊరట.. 14వ తేదీ వరకూ అరెస్ట్ వద్దు...

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక

అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు పనిమనిషి కేసులో కాస్త ఊరట లభించింది. శశికళ భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా కేసును వెనక్కి తీసుకోవాలంటూ శశికళతో ఆమె కుటుంబ సభ్యులు సైతం తనను బెదిరించారని పోలీసులకు, డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది. 
 
దీంతో శశికళ పుష్పతో పాటు ఆమె భర్త తిలకన్, తల్లి గౌరీలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాము అరెస్ట్ కాకుండా ఉండేందుకు మధురై హైకోర్టు బెంచ్‌లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ నెల 14వ తేదీ వరకు వీరిని అరెస్ట్ చేయకూడదంటూ.. ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 14న జరుగుతుందని కోర్టు పేర్కొంది.