గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (09:34 IST)

శశికళ పుష్ప, భర్త, కుమారుడికి ఊరట.. లైంగిక దాడి కేసు వాపస్ తీసుకున్న పనిమనిషులు

అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్ రాజాలపై నమోదైన అత్యాచారయత్నం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు యువతులు వెల్లడించారు. శశికళ పుష్ప ఇంట ప

అన్నాడీఎంకే బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్ రాజాలపై నమోదైన అత్యాచారయత్నం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు యువతులు వెల్లడించారు. శశికళ పుష్ప ఇంట పనిచేసిన ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ తమపై అత్యాచారయత్నంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ప్రస్తుతం వాపస్ తీసుకోవడంతో కేసు మలుపు తిరిగింది. ఈ మేరకు తమ ఫిర్యాదులు వాపసు చేసుకుంటున్నట్లు బుధవారం తూత్తుకుడి ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.
 
ఇకపోతే.. ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై దాడి జరిపిన శశికళ పుష్పను దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ సమయంలోనే శశికళ పుష్ప ఇంట పనిచేసిన ఇద్దరు అక్కాచెలెళ్లు కూడా తమపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి శశికళ భర్త, కుమారుడు పాల్పడ్డారని కేసు నమోదు చేసారు. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు శశికళ పుష్ప కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి పనిమనుషులుగా పనిచేసిన ఆ అక్కాచెల్లెళ్లు.. కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు.