గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (14:20 IST)

ఉత్తరప్రదేశ్ ప్రేమికుల డెత్ వారెంట్లు రద్దుచేసిన సుప్రీంకోర్టు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రేమికులకు కింది కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్లను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. యూపీకి చెందిన షబ్నం అనే యువతి తన ప్రేమికుడు సలీంతో కలిసి గత 2008 ఏప్రిల్ 15వ తేదీన తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసింది. వీరిలో ఓ పాప కూడా ఉంది. 
 
ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రేమికులిద్దరికీ 2010లో మరణశిక్ష పడింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఈ నెల 21న డెత్ వారెంట్ జారీ కావడంతో నిందితులు సుప్రీంకు వెళ్లగా, 25న కోర్టు స్టే విధించింది. తాజాగా వారెంట్లను రద్దు చేయడం గమనార్హం.
 
నిందితులు పెట్టుకునే రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండానే డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.