శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (19:24 IST)

అమీర్ ఖాన్ అమెరికా వెళ్లిపోతున్నారా? చెంపదెబ్బ కొడితే లక్ష ఇస్తారట!

బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్‌ను అసహనం వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పేలా లేవు. ఓ వైపు విమర్శలు.. మరోవైపు దాడులకు ఆర్ఎస్ఎస్ రెడీగా ఉంది. దేశంలో నెలకొన్న అసహనంతో దేశాన్ని విడిచి వెళ్ళిపోదామని తన భార్య వెల్లడించినట్లు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అమీర్ ఖాన్ స్పందించి.. వివరణ ఇచ్చినా.. విమర్శకుల నోర్లు ఏమాత్రం మూతపడట్లేదు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్ సైట్ కథనం ప్రకారం.. అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం దంగల్. పంజాబ్‌లోని లూథియానాలో ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. లూథియానాలో తన షూటింగ్ షెడ్యూల్ ముగియగానే ఆయన యూఎస్‌కు ఒక చిన్న ట్రిప్పు కోసం వెళ్తున్నారని తెలిసింది. అయితే అమీర్ ఖాన్ యూఎస్ ట్రిప్పు ముందుగా ప్లాన్ చేసుకున్నరా? లేక ప్రస్తుత పరిస్థితుల కారణంగా అమీర్ అమెరికా వెళుతున్నారా? అన్న విషయం తెలియదు’ అని ఆ కథనంలో పేర్కొంది. కాగా, అమీర్ పై వస్తున్న విమర్శలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు మరింత భద్రత పెంచారు.
 
ఇదిలా ఉంటే.. అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. లూధియానాలో అమీర్ ఖాన్ బస చేసిన 'రాడిసన్ బ్లూ' హోటల్ కు చేరుకున్న శివసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. కొట్టిన ప్రతి దెబ్బకు లక్ష రూపాయలిస్తామని వారు ప్రకటించారు.