శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (19:11 IST)

ప్రియుడితో భార్య గర్భవతి... భార్యను అలా చేయమన్నాడు... ఆమె ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధం ఓ ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. ఈ హత్య అతి కిరాతకంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 27 ఏళ్ళ విపిన్ శుక్లా పంజాబ్ భటిండా సమీపంలోని ఎయిర్ బేస్‌లో విధులు

వివాహేతర సంబంధం ఓ ఉద్యోగి ప్రాణాలు బలిగొంది. ఈ హత్య అతి కిరాతకంగా జరిగిందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన 27 ఏళ్ళ విపిన్ శుక్లా పంజాబ్ భటిండా సమీపంలోని ఎయిర్ బేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ భార్యల సంక్షేమ సంఘం క్యాంటీన్‌లో కార్పొరల్‌గా ఉన్న అతడికి యూపీకి చెందిన సార్జెంట్ సులేష్ కుమార్ భార్య అనురాధ పటేల్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అనురాధ పటేల్ గర్భం దాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కూడా కోరింది. 
 
కానీ అప్పటికే విపిన్ శుక్లాకు పెళ్లి కావడంతో నో చెప్పాడు. చివరకు ఈ విషయం సులేష్‌కు తెలియడంతో అల్లరికాకుండా ఉండేందుకు విపిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. క్వార్టర్ మారుతున్నానని ఫోన్ చేసి రమ్మన్నాడు. అక్కడకు వచ్చిన విపిన్‌ శుక్లాను భార్య, బావతో కలిసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టి మరో క్వార్టర్‌కు మారాడు. ఫిబ్రవరి 19న విపిన్ మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికాడు.
 
శరీర భాగాలను పాలిథిన్ కవర్లలో చుట్టి కొన్నింటిని ఫ్రిజ్‌లో మరికొన్ని అల్మారాలో దాచాడు. ఫిబ్రవరి 8న జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. కానీ విపిన్ భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్స్ సహకారంతో మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్యకు కారణమైన సార్జెంట్ సులేష్ కుమార్, అతడి భార్య అనురాధను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారిలో ఉన్న బావ శశి భూషన్ కోసం గాలిస్తున్నారు.