శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:43 IST)

ఎస్.. నేనే హత్య చేశా.. : షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి

తన కుమార్తె షీనా బోరాను తానే హత్య చేసినట్టు తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబై పోలీసుల విచారణలో వెల్లడించారు. తన కుమార్తె షీనా బోరాను తాను హత్య చేయలేదంటూ చెప్పుకొచ్చిన ఇంద్రాణి దాదాపు పది రోజుల తర్వాత నేరాన్ని అంగీకరించింది. హత్యకు దారితీసిన పరిస్థితులను ఇంద్రాణి పోలీసులకు వివరించారు. ఆ సమయంలో ఆమె కుప్పకూలి పడిపోయినట్లు సమాచారం. 
 
మరోవైపు... ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియాను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా నాలుగు గంటల పాటు ఇంద్రాణిని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడిగారు. తొలుత ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టిన పోలీసులు, తమకున్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. పీటర్ చెప్పిన సమాధానాలు, ఇంద్రాణి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు.