శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (13:58 IST)

ఇంద్రాణి ఏం చేస్తోంది.. ఏం తింటోంది.. ఇదేనా మీడియా పని : శివసేన ధ్వజం

ప్రజాస్వామ్య దేశంలో 'ఫోర్త్‌ ఎస్టేట్'గా భావిస్తున్న మీడియా ఇటీవలి కాలంలో ప్రధాన అంశాలను విస్మరిస్తోందని శివసేన తన సంపాదకీయంలో ఏకిపారేసింది. ముఖ్యంగా ఇంద్రాణి కేసుకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యతను ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. 
 
ఈ సంపాదకీయంలో అక్షింతలు వేసింది. ఇంద్రాణి హత్య ఎలా చేసింది? ఆమె జైల్లో ఏం చేస్తోంది? ఏం తింటోంది? వంటి విషయాలను ప్రజలకు అందిస్తూ, కీలకమైన కరవు పరిస్థితులు, సరిహద్దుల్లో ఉద్రిక్తత వంటి అంశాలను భారత మీడియా పక్కన పెట్టిందని దుయ్యబట్టింది. 1965 నాటి భారత్, పాకిస్థాన్ యుద్ధం 50వ వార్షికోత్సవం కన్నా, కూతురిని హత్య చేసిన తల్లి వార్తలను ప్రముఖంగా ప్రచురించడం ఎంత వరకూ సమంజసమని శివసేన ప్రశ్నించింది.