గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2016 (18:03 IST)

సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి రాలేదా..? పంబ రేగ్గొడతాం... పాక్‌కు శివసేన వార్నింగ్

పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు

పాకిస్తాన్ దేశానికి శివసేన గట్టి వార్నింగ్ ఇచ్చింది. సర్జికల్ దాడులు చేసినా పాకిస్తాన్ దేశానికి బుద్ధి వచ్చినట్లు కనబడలేదని శివసేన లీడర్ మనీషా కయాండే అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ... భారతదేశాన్ని బలవంతంగా యుద్ధం చేయడానికి పురిగొల్పవద్దని హెచ్చరించారు. పదేపదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా పౌరులు, సైనికులు మృత్యువాత పడుతున్నారనీ, ఇది ఇలాగే కొనసాగితే మటుకు భారతదేశం మరోసారి పాక్‌కు బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు.
 
పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులతో కలిసిపోయారనిపిస్తోందనీ, పాకిస్తాన్ రేంజర్లు పెద్దఎత్తున కాల్పులకు దిగుతూ భారతదేశ సైనికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. 12 గంటల్లో ఆరుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారనీ, వారి కాల్పుల్లో గాయపడ్డ పోలీసు మృత్యువాత పడ్డారని అన్నారు.