గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (16:33 IST)

బీహార్‌లో పడవ బోల్తా.. ఆరుగురి మృతి.. మరో ఐదుగురు గల్లంతు

బీహార్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బీహార్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్లో ఈ ప్రమాదం జరిగింది.
 
శనివారం 16 మంది ప్రయాణీకులతో వెళుతున్న పడవ అకస్మాత్తుగా డ్యామ్లో బోల్తాపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను గ్రామస్తుల సాయంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. గల్లంతయిన ఐదుగురిని కాపాడేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.