సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై జ్యోతిష్కుడి అత్యాచారం... మత్తు పానీయం ఇచ్చి...
పశ్చిమ బెంగాల్కి చెందిన 20 ఏళ్ల యువతి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంది. ఆమె జ్యోతిష్యంపై ఉన్న నమ్మకంతో తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు బెంగుళూరులోని హోయసళ నగరలో నివసించే దామోదర్ అనే ఒక జ్యోతిషుడి దగ్గరకి వెళ్ళింది. జ్యోతిషుడు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించాడు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేశాడు.
పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన దామోదరన్ అలియాస్ దాము రెండు సంవత్సరాల క్రితం రామమూర్తినగరలోని హొస్సళ నగర్ లో జ్యోతిష్య కేంద్రాన్ని ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దామోదరన్ దగ్గర ఈనెల 19వ తేదీన అపాయింట్మెంట్ తీసుకున్నారు.