సైన్యం వెంటే కాంగ్రెస్.. శభాష్ మోడీజీ... మీ సర్కార్కు మా సంపూర్ణ మద్దతు : సోనియా
భారత సైన్యం వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పాక్ ఆక్రమిక కాశ్మీర్లో భారత సైన్య మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అదేసమయంలో దేశ భద్రత కోసం ప్
భారత సైన్యం వెంటే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పాక్ ఆక్రమిక కాశ్మీర్లో భారత సైన్య మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. అదేసమయంలో దేశ భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆమె ప్రకటించారు. ఈ దాడుల ద్వారా పాక్కు గట్టి సందేశం పంపామన్నారు. చొరబాట్లకు, మన ప్రజలపై, సైన్యంపై దాడులకు దిగితే భారత తగిన సమాధానం చెబుతుందని తెలియజేశామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా సైన్యాన్ని అభినందించారు. ‘‘దేశాన్ని, మనను రక్షించేందుకు వీరోచితంగా పోరాడుతున్న మన జవాన్లకు కాంగ్రెస్ పార్టీ, నేను సెల్యూట్ చేస్తున్నాం. జై హింద్’’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు.. సోనియా గాంధీతో విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ భేటీ అయ్యారు. పీవోకేలో భారత దాడులపై వివరించారు. ఉగ్రవాదం అంతం దిశగా ప్రభుత్వం చేపట్టే అన్ని చర్యలకూ మద్దతిస్తామని సుష్మకు సోనియా భరోసా ఇచ్చారు.