శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:02 IST)

తెల్లతోలు వల్లే సోనియా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యింది: గిరిరాజ్ సింగ్

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీపై భాజపా నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
 
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు బీజేపీ మైండ్సెట్కు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సోనియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని గిరిరాజ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే బీజేపీ సోనియా గాంధీపై గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.