గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (14:53 IST)

సోనియా గాంధీ తప్పుకుని.. రాహుల్ వస్తే మంచిది: దిగ్విజయ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ ఇక తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించి సోనియా గాంధీ పక్కకు తప్పుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఓటమిలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు.
 
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రస్తుతం సాగుతోంది. అది ఈ ఏడాది చివరకు పూర్తవుతుంది. 2015లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు ఇంతకు మించి మంచి తరుణం దొరకబోదని దిగ్విజయ్ పేర్కొన్నారు.