గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:23 IST)

చర్చ్ దాడి వెనక దాగివున్న ప్రేమకథ: మతం పేరుతో ప్రేమకు ఫుల్‌స్టాప్!

ఏప్రిల్ 16న ఆగ్రాలో ప్రతాప్‌పురా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తుతెలియని దుండగులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి వెనక ప్రేమ కథ దాగివుందని తెలియవచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆమె క్రిస్టియన్.. అతను ముస్లిం(హైదర్ ఆలీ). నాలుగు నెలల కిందట ఓ చర్చిలో హైదర్ ఆలీ , ఆమెను చూసి మనసు పారేసుకున్నడు. మొదట ఆమె కూడా ఓకే చెప్పింది. 
 
వేర్వేరు మతాలు కాబట్టి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని ఆలోచించి, ఒక్కసారిగా ప్రేమబంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది యువతి.. అతడిని కలవడం మానేసింది. ప్రేమ విఫలమైన కోపంతో ఆమె అనుసరించే మతానికి సంబంధించిన ప్రార్థనాలయంపై స్నేహితులతో కలిసి హైదర్ ఆలీ దాడి చేశాడు. విగ్రహాలు ధ్వంసం చేసి పారిపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు.