బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2017 (13:10 IST)

ప్రేమించలేదని.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. యువతి సజీవదహనం

చెన్నైలో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వెంటపడి వేధించడంతో పాటు ఏకంగా ఇంటికొచ్చి.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై ఆదంబాక్కానికి చ

చెన్నైలో ప్రేమోన్మాది విరుచుకుపడ్డాడు. ప్రేమించమని వెంటపడి వేధించడంతో పాటు ఏకంగా ఇంటికొచ్చి.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై ఆదంబాక్కానికి చెందిన ఇందుజా వెంట ఆకాష్ అనే యువకుడు ప్రేమించాలని వేధించాడు. అతడి ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో ఇందుజా పగ పెంచుకున్నాడు. 
 
సోమవారం రాత్రి యువతిని కలిసేందుకు వెళ్లిన ఆకాష్.. తనను ప్రేమించలేదంటే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయితే అతడికి వార్నింగ్ ఇచ్చేందుకు ఇందుజా తల్లి తలుపు తెరిచింది. అంతే ఇంట్లోకి చొచ్చుకుపోయిన ఆకాష్.. ఇందుజాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంటికి మంటలు వ్యాపించడంతో యువతి సజీవదహనమైంది. ఆమె తల్లి, సోదరి తీవ్రంగా గాయపడ్డారు.
 
కాలిన గాయాలతో ఉన్న వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇందుజా సోదరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో వున్న ఆకాష్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.