శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 మే 2017 (13:38 IST)

మహారాష్ట్ర పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్స్‌పై నిషేధం.. పిజ్జాకు బదులు చపాతీలు

మహారాష్ట్రలోని ఫడ్నవీస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని అన్ని పాఠశాలల క్యాంటీన్లలో ఒబిసిటీకి దారితీసే జంక్ ఫుడ్స్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. హై ఇన్ ఫ్యాన్, సాల్ట్ అండ్ షుగర్ ఆహారా

మహారాష్ట్రలోని ఫడ్నవీస్ సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని అన్ని పాఠశాలల క్యాంటీన్లలో ఒబిసిటీకి దారితీసే జంక్ ఫుడ్స్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. హై ఇన్ ఫ్యాన్, సాల్ట్ అండ్ షుగర్ ఆహారాన్ని పాఠశాలల్లో అమ్మకుండా నిషేధం విధించింది.

జంక్ ఫుడ్స్‌లో తక్కువ స్థాయిలో విటమిన్స్, మినరల్స్ ఉండటమే కారణమని మహారాష్ట్ర సర్కారు తెలిపింది. దీంతో ప్రస్తుత క్యాంటీన్లలో అందుబాటులో ఉండే బర్గర్, పిజ్జా, ఫింగర్ చిప్స్, పఫ్‌ల స్థానంలో చపాతీలు అన్నం, రాజ్మా, గోధుమ ఉప్మా, కిచడీ, ఇడ్లీ, వడ, సాంబార్, జల్ జీరా, లెమన్ జ్యూస్ వంటివి అందుబాటులోకి తీసుకురావాలని మహారాష్ట్ర సర్కారు సూచించింది.  
 
ఇంకా జంక్ ఫుడ్‌కు అలవాటు పడిన విద్యార్థులు విద్యాభ్యాసంలో వెనుకబడిపోతున్నారని.. తామిచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి..? జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలేంటి అనేదానిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు తీసుకోవాలని మహారాష్ట్ర సర్కారు విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.