శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 అక్టోబరు 2014 (21:38 IST)

రాజపక్సెకు భారతరత్న ఇవ్వండి... మోడికి సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి

భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి అంటేనే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఇపుడు ఆయన మరో దుమారాన్ని సృష్టించినట్లే ఉన్నారు. శ్రీలంక తమిళులను ఊచకోత కోశారనే విమర్శలను ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెకు భారతరత్న ఇవ్వాలంటూ ఏకంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది. 
 
భారత భద్రత దళాలకు అనుకూలంగా రాజపక్సె ప్రభుత్వం వ్యవహరించింది కనుక ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తను రాసిన లేఖ ప్రధాని కార్యాలయానికి అందినట్లు ప్రత్యుత్తరం తనకు అందిందంటూ చెప్పుకొచ్చారు స్వామి. మరి సుబ్రహ్మణ్యస్వామి లేఖ నేపథ్యంలో తమిళ తంబిలకు ఎంతమేర ఆగ్రహం తెప్పిస్తాయో వేచి చూడాలి.